తిరువనంతపురం : కేరళలో నిఫా వైరస్ (Nipah virus) వ్యాప్తి కొనసాగుతోంది. ఈ వ్యాధి బారినపడి ఆగస్ట్ 30 నుంచి కోజికోడ్ జిల్లాలో ఇద్దరు మరణించగా 9 పంచాయితీలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు నియంత్రణలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మరిన్ని చర్యలు చేపట్టింది.
తాజా నియంత్రణల్లో భాగంగా కోజికోడ్లోని కంటైన్మెంట్ జోన్లలో ప్రార్ధనా స్ధలాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. కంటైన్మెంట్ జోన్లు అన్నింటిల్లో ప్రార్ధనా స్ధలాలు సహా అన్ని బహిరంగ కార్యక్రమాలను నిలిపివేయాలని, ప్రజలు గుమికూడరాదని ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రాంతాల్లో నిత్యావసరాలను విక్రయించే షాపులు, మందుల షాపులను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనుమతిస్తారు. కాగా శుక్రవారం ఓ 39 ఏండ్ల వ్యక్తికి నిర్వహించిన పరీక్షలో నిఫా వైరస్ పాజిటివ్గ తేలిందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వెలుగుచూసిన నిఫా వైరస్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాక అధికారులు వెల్లడించారు.
Read More :
Nuh violence | నుహ్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్