న్యూఢిల్లీ: బిట్కాయిన్ను చెల్లించి ఇకపై దేశంలో పిజ్జా, కాఫీ, ఐస్క్రీమ్ తదితర ఆహార పదార్థాలను కొనుగోలు చేయొచ్చని భారత క్రిప్టో ఎక్స్చేంజ్ ‘యునోకాయిన్’ ప్రకటించింది. అయితే, క్యాష్ చెల్లింపుల మాదిరిగా నేరుగా ఈ కొనుగోలు చేయడం కాకుండా.. బిట్కాయిన్ విలువకు సరిపడే మొత్తంలో రూ. 100 నుంచి రూ. 5 వేల వరకు వోచర్లను జారీచేస్తామని పేర్కొంది. ఈ వోచర్లతో కొనుగోళ్లు చేసుకోవచ్చన్నది.