కోల్కతా, ఆగస్టు 29: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ మరో కుట్రకు తెర లేపింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబసభ్యులందరి ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశించాలని కలకత్తా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. మమత సోదరులు కార్తీక్ బెనర్జీ, బబున్ బెనర్జీ తదితరుల ఆస్తులపై దర్యాప్తు సంస్థలతో సోదాలు చేయించాలని బీజేపీ రాష్ట్ర నేత, అడ్వొకేట్ తరుణ్ జ్యోతి పిటిషన్ దాఖలు చేశారు. పిల్పై మమత స్పందించారు. కోర్టులో పిటిషన్ వేసే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉన్నదని తెలిపారు. ‘ఇంకేదైనా అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ వేసుకొమ్మని వాళ్లకు చెప్పండి’ అని చురకలు అంటించారు.