మెల్బోర్న్: ఈ నెల 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3ని విజయవంతంగా లాంచ్ చేసి భూస్థిర కక్ష్యలోకి పంపింది. శ్రీహరికోటలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోమనౌక దాదాపు 40 రోజులపాటు అంతరిక్షంలో ప్రయాణించి చివరికి ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై దిగనుంది.
అయితే, ఈ చంద్రయాన్ -3ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన అరగంట తర్వాత ఆస్ట్రేలియా గగనతలంపై దూసుకెళ్తుండగా ఆ దేశానికి చెందిన ఓ పౌరుడు తన ఇంటి పైనుంచి మొబైల్లో ఫొటోలు తీశాడు. ఆ తర్వాత అందులోని ఓ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.