న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. ఎల్పీజీ సిలిండర్పై రూ.15 పెంచారు. పెట్రోలియం కంపెనీలు ధరను పెంచినట్లు తెలుస్తోంది. పెరిగిన ధరతో 14.2 కేజీల నాన్ సబ్సిడీ సిలిండర్ ఢిల్లీలో రూ.899కి వస్తోంది. ఇక 5 కేజీల సిలిండర్ ఇప్పుడు రూ.502కు లభిస్తుంది. ఇవాళ్టి నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.