ఇప్పటికే పలు రాష్ర్టాల్లోవంద దాటిన పెట్రోల్ ధర
తాజా బాదుడుతో పెట్రోల్పై 27, డీజిల్పై 28 పైసలు వడ్డింపు
న్యూఢిల్లీ, జూన్ 4: ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని జిల్లాల్లో (విశాఖ మినహా), తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, జమ్ముకశ్మీర్లోని లెహ్లో రూ.100 దాటింది. ఇటీవల నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి (మే 4 నుంచి) వరుసగా ఇంధన ధరలను పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. తాజాగా శుక్రవారం మరోసారి ధరలను పెంచాయి. శుక్రవారం లీటరు పెట్రోల్పై 27 పైసలు, డీజిల్పై 28 పైసలు పెరిగింది. దీంతో ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటరు పెట్రోల్ ధర రూ.105.81 చేరింది.