Assembly Election Results 2023: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భాగంగా ఉత్తరాదిన ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ లలో కాంగ్రెస్ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. సాయంత్రం 4 గంటలకు వెలువడ్డ ఫలితాల ప్రకారం ఈ మూడు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ వ్యతిరేక ఫవనాలు వీస్తున్నాయి. ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకతకు ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ప్రజలు ఓటింగ్ ద్వారా కాంగ్రెస్కు బుద్దిచెప్పారని రమణ్ సింగ్ అన్నారు. నాలుగు గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. 90 సీట్లు ఉన్న ఛత్తీస్గఢ్లో బీజేపీ ఏకంగా 56 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్ 32 స్థానాల్లో ముందంజలో ఉంది. గోండ్వానా గణతంత్ర పార్టీ (జీజీపీ) ఒక స్థానంలో ముందుండగా బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.