న్యూఢిల్లీ, ఆగస్టు 4: దేశంలోని ప్రజాస్వామ్య పరిస్థితి ప్రధాని కార్యాలయంలోని సలహాదారుల కన్నా సాధారణ ప్రజలకే బాగా తెలుసని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఆర్థిక వృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. ‘ఆర్థిక శక్తికి ఉద్యోగాలు కీలకం. దేశానికి ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్, కన్సల్టెంట్ కావాల్సిన అవసరం లేదు. ఎన్నో దేశాల కన్నా మన దేశం వృద్ధి రేటు ఎక్కువే ఉండొచ్చు. జనాభా లెక్కన చూసుకొంటే ఇంతకంటే ఎక్కువ వృద్ధి రేటు నమోదు కావాలి’ అని పేర్కొన్నారు. నోట్ల రద్దు, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తదితరాలపై నిర్ణయం తీసుకొనే ముందు చర్చ చేయాల్సిందని వెల్లడించారు.