పట్నా: బుధవారం ఉదయం 6.24 గంటలు. ప్రయాణికులు రైలు కోసం రైల్వే స్టేషన్లో వేచిఉన్నారు. ఇంతలో ఓ రైలు ఇంజిన్ వాయు వేగంతో దూసుకొస్తున్నది. ఇంజిన్కి ఒక్క డబ్బా మాత్రమే ఉన్నది. అప్పటికే ఆ రైలుకు ఉన్న 58 కోచ్లలో 53 కోచ్లు చెల్లాచెదురయ్యాయాయి. ఓ బోగీ పట్టాలు తప్పినప్పటికీ ఇంజిన్ నుంచి విడిపోలేదు. అయినప్పటికీ ఆగని ఆ రైలు.. బోగీని గుంజుకుంటూ జెట్ స్పీడ్లో రెప్పపాటులోనే స్టేషన్ను దాటేసింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు స్టేషన్ నుంచి పరుగులు పెట్టారు. ఇదంతా బీహార్లోని గయా ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది.
#WATCH बिहार: गया-कोडरमा रेलवे लाइन के गुरपा स्टेशन के पास मालगाड़ी के 53 डिब्बे पटरी से उतर जाने के बाद उतरी हुई मालगाड़ी के एक डिब्बे को एक इंजन घसीटता हुआ ले गया। (26.10)
(वीडियो सोर्स: स्थानीय) pic.twitter.com/Y0a0b29yI5
— ANI_HindiNews (@AHindinews) October 26, 2022
గయాలోని హజారీబాగ్ నుంచి దాద్రీకి బొగ్గుతో వెళ్తున్న గూడ్సు రైలు.. పట్టాలు తప్పి బోల్తా పడింది. రైలుకున్న 58 కోచ్లలో 53 కోచ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. బోగీల్లో ఉన్న బొగ్గు మొత్తం నేలపాలైంది. బ్రేక్ ఫెయిల్కావడంతోనే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలిపారు.