మధ్యప్రదేశ్ రోడ్లపై గోవా స్టైల్ బీచ్ పార్టీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది అక్కడి ప్రభుత్వంపై ఆ రాష్ట్ర ప్రజలు తెలిపిన వెరైటీ నిరసన. వర్షాలకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో రోడ్డు గుంతలమయమైంది. దీంతో గ్రామస్తులు ఆ గుంతనే గోవా బీచ్గా మార్చేశారు. అందులో కుర్చీలేసుకొని పార్టీ చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ గ్రామంలో చిత్రీకరించారు. వర్షంధాటికి రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి నీళ్లు నిలిచిపోయాయి. అందులో కొందరు గ్రామస్తులు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. గోవా స్టైల్లో టీ-షర్టులు, టోపీలు, కళ్లజోళ్లతో కనిపించారు. కొందరు మ్యూజిక్ వింటూ కనిపించగా, మరికొందరు చేతుల్లో లిక్కర్ బాటిల్స్ పట్టుకుని ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ పార్టీ చేసుకున్నారు. పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
अगर आप ज़िंदादिल हैं तो आपको ईश्वर के अलावा कोई कष्ट नहीं दे सकता। नगर निगम या सरकार को कोसना छोड़िए। अपनी पॉज़िटिवीटी के ‘बीच’ जीवन का आनंद लीजिए।
सड़क के गड्ढे को बीच 🏖 बनाने की ये प्रतिभा मध्य प्रदेश के लोगों ने दिखाई है। 😍
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) July 4, 2022