న్యూఢిల్లీ : కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. పెగాసస్ హ్యాకింగ్ నివేదికపై ఇవాళ లోక్సభలో స్పందించారు. విపక్ష నేతలు, జర్నలిస్టులతో పాటు ఇతరులపై ఇజ్రాయిల్కు చెందిన స్పైవేర్ పెగాసస్తో హ్యాకింగ్ జరిగినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభకావడానికి ఒక రోజు ముందు ఆ నివేదిక బయటకు రావడం యాదృచ్చికం ఏమీకాదన్నారు. పెగాసన్ హ్యాకింగ్ సంచలనాత్మక కథనం వెనుక ఎటువంటి ఆధారం లేదన్నారు. అక్రమరీతిలో నిఘా జరగడం అసాధ్యమని మంత్రి తెలిపారు. గతంలోనూ వాట్సాప్లో పెగాసస్ స్పైవేర్తో హ్యాకింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి, ఆ ఆరోపణల్లో ఆధారాలు లేవని, అన్ని పార్టీలు వాటిని ఖండించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని, అతిపెద్ద వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకే ఇవాళ పత్రికల్లో ఫోన్ల హ్యాకింగ్ కథనాలు వచ్చినట్లు ఆయన ఆరోపించారు.
సుమారు 50వేల మంది ఫోన్ నెంబర్లను డేటాబేస్లో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా.. దాంట్లో వాస్తవం లేదని మంత్రి చెప్పారు. ఒకవేళ డేటా బేస్లో ఫోన్ నెంబర్లు ఉన్నా.. పెగాసస్ వల్ల డివైస్ ఇన్ఫెక్ట్ అయ్యిందో లేదో స్పష్టంగా తెలియదన్నారు. డేటాబేస్లో నెంబర్ ఉన్నంత మాత్రాన అది స్నూపింగ్ కిందకురాదన్నారు.