న్యూఢిల్లీ, మార్చి 16: కాంగ్రెస్ మాజీ నేత పీసీ చాకో మంగళవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరారు. కేరళకు చెందిన ఆయన కాంగ్రెస్లో గూపు రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపిస్తూ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. చాకో బీజేపీలో చేరుతారని తొలుత ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటికి చెక్ పెడుతూ.. ఆయన శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు.