ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ వ్యవహారంపైనే వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై మమత సలహా తీసుకోవడం గమనార్హం. నారద స్కాంతో సంబంధమున్న మంత్రులను సస్పెండ్ చేశారా? అని శరద్ పవార్ ఆమెను అడిగినట్లు సమాచారం. అయితే… నవాబ్ మాలిక్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కేబినెట్ నుంచి తొలగించవద్దని మమత స్పష్టం చేసినట్లు పవార్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో ఎన్సీపీకి మద్దతుగా తాముంటామని మమతా బెనర్జీ పవార్కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో నవాబ్ మాలిక్ను ఈడీ ఉదయం నుంచి ప్రశ్నిస్తోంది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ మరణ వాంగ్మూలాన్ని కూడా ఈడీ నమోదు చేసింది. విచారణ నిమిత్తమై ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం 7 గంటలకే నవాబ్ మాలిక్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఉదయం నుంచే మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.