న్యూఢిల్లీ, మార్చి 26: మైక్రోసాప్ట్ తన విండోస్, సర్ఫేస్ విభాగాల అధిపతిగా భారతీయ మూలాలున్న ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని నియమించింది. ఈ విభాగానికి ఇటీవలి వరకు బాస్గా ఉన్న పనోస్ పనయ్ గతేడాది అమెజాన్లో చేరారు. దీంతో తమ కంపెనీలో మూడేండ్లుగా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న పవన్కు మైక్రోసాఫ్ట్ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. పవన్ 1999లో మేరీల్యాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. 23 ఏండ్ల క్రితం రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్గా పవన్ మైక్రోసాఫ్ట్లో తన కెరీర్ను ప్రారంభించారు.