న్యూఢిల్లీ: పాత్రాచాల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్రౌత్ జ్యుడీషియల్ కస్టడీని ఈడీ స్పెషల్ కోర్టు మరోసారి పొడిగించింది. ఈ నెల 21 వరకు రౌత్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన తర్వాతనే ఆయన బెయిల్ పిటిషన్పై విచారణను కొనసాగించనున్నట్లు తెలిపింది.
పాత్రా వాలా చాల్ పునర్నిర్మాణ ప్రాజెక్టులో ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. పలువురిపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టింది. అందులో భాగంగానే గత ఆగస్టు 1న సంజయ్ రౌత్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంది. కొన్నాళ్లు తన కస్టడీలో ఉంచుకుని ఇంటరాగేట్ చేసింది.
తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. స్పెషల్ కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే విచారణ ఇంకా పూర్తికాలేదన్న ఈడీ అభ్యర్థనలతో కోర్టు రౌత్ కస్టడీని పొడిగిస్తూ వస్తున్నది. చివరిసారిగా విధించిన కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో కోర్టులో హాజరుపర్చగా మరోసారి కస్టడీని పొడిగించింది.