పాట్నా: ఓ వ్యక్తి మెదడులో క్రికెట్ బంతి సైజులో బ్లాక్ ఫంగస్ను పాట్నాలోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్) డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. 60 ఏళ్ల ఆ పేషెంట్కు మూడు గంటలు సర్జరీ నిర్వహించి ఫంగస్ను తొలగించడం విశేషం. అనిల్కుమార్ అనే ఆ పేషెంట్ ఈ మధ్యే కొవిడ్ నుంచి కోలుకున్నాడు. అయితే తరచూ మైకంగా ఉండటం, స్పృహ తప్పడం జరుగుతుండేది. దీంతో అతన్ని ఐజీఐఎంఎస్కు రిఫర్ చేశారు. అక్కడ అతనికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు గుర్తించారు.
సర్జరీ తర్వాత అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ సర్జరీ నిర్వహించిన డాక్టర్ మనీష్ మండల్ మాట్లాడుతూ.. ఫంగస్ అతని ముక్కు ద్వారా మెదడులోకి చేరిందని చెప్పారు. అయితే అతని కళ్లలోకి మాత్రం అది వెళ్లలేదని తెలిపారు. నిజానికి ఇలాంటి కేసుల్లో చాలా వరకూ పేషెంట్ కళ్లు తొలగించాల్సి వస్తుంది. బీహార్లో ఇప్పటి వరకూ 500కుపైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.