పాట్నా: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రం లీక్ అయ్యిందని అభ్యర్థులు ఆరోపించారు. ఒక పరీక్షా కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. అక్కడకు చేరుకున్న జిల్లా కలెక్టర్ ఒక అభ్యర్థి చెంపపై కొట్టారు. అలాగే నిరసనకారులను తరిమేందుకు ప్రయత్నించారు. (Patna DM slaps BPSC aspirant) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. గ్రూప్ ఏ, బీ పోస్టుల భర్తీ కోసం బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) జాయింట్ ప్రిలిమినరీ పోటీ పరీక్ష శుక్రవారం జరిగింది. ఆ రాష్ట్రంలోని 945 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు ఐదు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
కాగా, పాట్నాలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని, ప్రశ్నాపత్రాల పంపిణీలో జాప్యం జరిగిందని, ఆ కేంద్రంలో నిర్వహణ లోపం ఉందని ఆరోపించారు. 200 మందికిపైగా అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 175 ప్రశ్నాపత్రాలు అందించడంపై ప్రశ్నించారు. పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తిన తమను ఎగ్జామ్ సిబ్బంది బెదిరించినట్లు ఆరోపించారు. అయితే అభ్యర్థుల ఆరోపణలను బీపీఎస్సీ ఛైర్మన్ ఖండించారు.
మరోవైపు పాట్నా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ ఆ పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఒక అభ్యర్థి చెంపపై ఆయన కొట్టారు. అలాగే నిరసన చేస్తున్న అభ్యర్థులను అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
VIDEO | Patna DM Dr Chandrashekhar Singh slaps a #BPSC aspirant protesting outside an examination centre in the city.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/dDE0l8BX8t
— Press Trust of India (@PTI_News) December 13, 2024
#WATCH | Patna | BPSC Candidates hold protest outside BAPU Exam Centre, Bihar.
The aspirants say, “Half of the students did not even get the OMR sheet or the question booklet for 15 minutes…. Many got the question booklet one hour late and it was snatched away in 10 minutes…… pic.twitter.com/VsKE4Ipwvu
— ANI (@ANI) December 13, 2024