న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: విమానాల్లో బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేసే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. విమానం లోపల ఇయర్ఫోన్లు వాడకుండా బిగ్గరగా సంగీతాన్ని వింటున్న ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపింది.
కేంద్ర సహాయమంత్రి మురళీధర్ మోహోల్ లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని సభ్యులకు తెలిపారు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా, బిగ్గరగా సంగీతం వినటంపై ప్రత్యేక నిబంధనేదీ లేనప్పటికీ, అధికారులు చర్య తీసుకోవచ్చునని అన్నారు.