లక్నో: చలిని తట్టుకునేందుకు కొందరు ప్రయాణికులు రైలు ఏసీ కోచ్లో చలి మంటలు వేశారు. (Bonfire In Train AC Coach) ఇది గమనించిన మిగతా ప్రయాణికులు భయాందోళన చెందారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు ప్రయాణికులపై కేసు నమోదు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ సంఘటన జరిగింది. మీరట్-ప్రయాగ్రాజ్ సంగం ఎక్స్ప్రెస్ రైలు ఏసీ కోచ్లో కొందరు వ్యక్తులు చలిమంటలు వేశారు. కదులుతున్న రైలులో చలి మంటలు వేయడం చూసి ఆ కంపార్ట్మెంట్లోని మిగతా ప్రయాణికులు భయాందోళన చెందారు. మొబైల్ ఫోన్లో దీనిని వీడియో తీశారు. పక్కన ఉన్న కంపార్ట్మెంట్లోని టీసీకి ఫిర్యాదు చేశారు.
కాగా, ఈ సంఘటనపై రైల్వే టీసీ, రైల్వే పోలీసులు స్పందించారు. వెంటనే ఆ ఏసీ కోచ్లోకి వెళ్లారు. చలి మంటలు వేసిన ప్రయాణికులను నిలదీశారు. భారతీయ కిసాన్ యూనియన్ (తికాయిత్ వర్గం) జాతీయ ఉపాధ్యక్షుడు కుశాల్ పాల్ ఆర్య మద్దతుదారులు, ఆ సంఘం యువ బ్రిగేడ్ అధ్యక్షుడు గౌరవ్ తికాయిత్ కూడా ఈ రైలులో ప్రయాణించినట్లు స్టేషన్ డైరెక్టర్ అశుతోష్ సింగ్ తెలిపారు. రైలులో చలి మంటలు వేసిన నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు వెల్లడించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనవరి 6న ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో కదులుతున్న రైలులో చలి మంటలు వేసిన సంఘటన జరిగింది. ఈ సంఘటనపై కూడా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.
A video of men standing around a bonfire in a moving train has surfaced. It was reported from Prayagraj bound Sangam Express. RPF later said the men seen in the video coukd not be traced. pic.twitter.com/k5phrJryDO
— Piyush Rai (@Benarasiyaa) January 18, 2024
संगम एक्सप्रेस मेरठ से प्रयागराज जा रही थी।
कुछ यात्रियों को कोच से धुआं उठता दिखा। उन्होंने धुएं की Video X पर पोस्ट कर दी। रेल मिनिस्ट्री से इंक्वायरी का ऑर्डर आ गया।
RPF/GRP की टीमें कोच में पहुंचीं। पता चला कि किसानों ने अंगीठी जलाई थी। वे भाकियू के अधिवेशन में जा रहे थे। pic.twitter.com/htFA56kdir
— Sachin Gupta (@SachinGuptaUP) January 17, 2024