కోల్కతా : టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టయిన టీఎంసీ నేత పార్ధా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీల ఆస్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా శాంతినికేతన్లో వీరిద్దరూ ఓ జాయింట్ ప్రాపర్టీని కలిగిఉన్నారని వెల్లడైంది. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో నిందితులిద్దరూ 2012లో ఉమ్మడి ఆస్తిని కొనుగోలు చేశారు.
వీరు అప్పట్లో రూ 20 లక్షలు వెచ్చించి ఫాంహౌస్ను కొనుగోలు చేశారని సంబంధిత పత్రాల్లో ఉన్నట్టు సమాచారం. ఇక బెంగాల్ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టయిన పార్ధ ఛటర్జీని పార్టీ పదవుల నుంచి టీఎంసీ తొలగించింది.