న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై చర్చకు బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ తిరస్కరించింది. యూఎస్లోని ఎస్వీబీ బ్యాంక్ కుప్పకూలటంపై ప్యానెల్ చర్చించాలనుకుంటున్నది, కానీ దేశంలో స్టాక్మార్కెట్ను అతలాకుతలం చేసిన అదానీ కుంభకోణంపై విచారణ చేయడానికి కేంద్రం ఎందుకు భయపడుతున్నదని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఆర్థిక విషయాలపై ఏర్పాటైన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో అదానీ కుంభకోణంపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విచారణ జరుపున్నదని పేర్కొంటూ చర్చకు తిరస్కరించారు.