న్యూఢిల్లీ: పార్లమెంటులో భద్రతా లోపం, లోక్సభలో కొందరు వ్యక్తులు బుధవారం చేసిన బీభ త్సం రైతు సంఘాల నేత రాకేశ్ తికాయిత్ ఓ ట్వీట్లో తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)కు కానీ, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)కు కానీ ఎటువంటి సంబం ధం లేదన్నారు.
లోక్సభలో అలజ డికి పాల్పడిన వారిలో అమోల్ షిండే ను పోలీసులు ప్రశ్నించారని, రైతు ల నిరసనలు, మణిపూర్ సంక్షో భం, నిరుద్యోగం వంటి సమస్యలు తనను తీవ్రంగా కలచివేశాయని షిండే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మరొక నిందితురాలు నీలం గతంలో రైతుల నిరసనల్లో పాల్గొ న్నట్టు వార్తలు వచ్చాయి.