Prostitution | న్యూఢిల్లీ: వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఓ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసే అవకాశం కనిపిస్తున్నది. వలస పాలన కాలంనాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు బదులుగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లులను ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అనంతరం వీటిని స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. ఈ కమిటీ శుక్రవారం సమావేశమైంది. తదుపరి సమావేశం నవంబరు 6న జరుగుతుంది. వ్యభిచారం నేరం కాదని సుప్రీంకోర్టు 2018లో తీర్పు చెప్పింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పునరుద్ధరించాలని ఈ కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉన్నది.