న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతారు. తొలి విడుత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11న ముగుస్తాయి. తర్వాత దాదాపు నెల రోజుల విరామం అనంతరం మార్చి 14న రెండో విడుత సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు ఏప్రిల్ 8న ముగుస్తాయి.