న్యూఢిల్లీ, జూన్ 24: ప్రభుత్వ మేధోసంస్థ నీతిఆయోగ్కు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈవో)గా పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్ ఈ నెల 30న పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పరమేశ్వరన్ను కేంద్ర ప్రభుత్వం సీఈవోగా నియమించింది.
రెండేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పరమేశ్వరన్ గతంలో తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. పారిశుధ్య నిపుణుడిగా ఆయనకు పేరుంది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలును ఆయనే పర్యవేక్షించారు.