న్యూఢిల్లీ : పర్మనెంట్ అకౌంట్ నంబర్(పాన్) దరఖాస్తుల కోసం ఏప్రిల్ 1 నుంచి దేశంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న కేవలం ఆధార్ ఆధారిత దరఖాస్తు ప్రక్రియ ముగిసిపోయి, సమర్పించవలసిన పత్రాల సంఖ్య మరింత కఠినతరం కానున్నది. ఆధార్ను మాత్రమే ఉపయోగించి పాన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 31తో ముగియనున్నది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి పాన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు ఆధార్తోపాటు జనన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ప్రూఫ్ ఆఫ్ బర్త్ కింద సమర్పించాల్సిన పత్రాల్లో బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఎస్ఎస్సీ సర్టిఫికెట్, మెజిస్ట్రేట్ జారీచేసే అఫిడవిట్లు వంటివి ఉంటాయి. పాత పాన్ దరఖాస్తులను ఏప్రిల్ 1 నుంచి స్వీకరించబోమని కామన్ సర్వీసెస్ సెంటర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో బుధవారం పేర్కొన్నది.