ప్రజాస్వామ్యంపై అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ నిర్వహిస్తున్న సమ్మిట్కు హాజరయ్యే విషయంలో పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. ఈ సమ్మిట్కు తాము హాజరుకావడం లేదని ప్రకటించింది. ఈ సమ్మిట్ ప్రారంభమయ్యే రోజునే పాకిస్తాన్ ఈ ప్రకటన చేయడం గమనించాల్సిన పరిణామం. ప్రజాస్వామ్యంపై వర్చువల్ సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు బిడెన్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 9,10 తారీఖుల్లో ఈ వర్చువల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమ్మిట్కు భారత్తో సహా మరో 100 దేశాలు పాల్గొంటున్నాయి. పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చైనా ప్రభావం ఉందని, ఆ ప్రభావంలో పడే పాకిస్తాన్ ఈ సమావేశానికి గైర్హాజరవుతోందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ఈ సమావేశానికి దక్షిణ ఆసియా నుంచి భారత్, పాక్, మాల్దీవ్, నేపాల్ దేశాలను అమెరికా ఆహ్వానించింది. చైనా, రష్యా దేశాలకు అసలు ఆహ్వానమే పంపలేదు. చైనా బద్ధ శత్రువైన తైవాన్కు ఆహ్వానం పంపడం గమనించాల్సిన పరిణామం.