జమ్మూ: జమ్మూలోని ఆర్నియా సెక్టార్లో గత రాత్రి కాల్పుల ఘటన జరిగింది. పాకిస్థాన్ రేంజర్లు(Pakistan Rangers) కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దు ఆర్నియాతో పాటు సుచేత్ఘర్ సెక్టార్లలో ఈ కాల్పులు జరిగాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆ పాక్ రేంజర్ల కాల్పులకు దీటుగా బదులు ఇచ్చినట్లు చెప్పారు.
#WATCH | A Border Security Force (BSF) personnel has sustained minor injury in an unprovoked firing by Pakistan Rangers in Jammu and Kashmir’s Arnia sector. He is receiving medical aid in a local hospital. pic.twitter.com/cEH2pk2YDM
— ANI (@ANI) October 27, 2023
జమ్మూ బోర్డర్ వద్ద పాక్ రేంజర్ల కాల్పుల వల్ల ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఆర్ఎస్ పురా సెక్టార్లోని అర్నియాలో ఇండ్లు కొన్ని దెబ్బతిన్నాయి. రాత్రంతా కాల్పులు జరగడం వల్ల స్థానిక గ్రామ ప్రజలు బంకర్లలోనే ఉండిపోయారు. బంకర్లు పెద్దగా ఉండడం వల్ల తమ ప్రాణాలను కాపాడుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
రేంజర్ల కాల్పుల్లో గాయపడ్డ ఓ జవానుకు స్థానిక ఆస్పత్రిలో చికిత్సను అందించారు.