న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత్లో అతర్భాగమైన పీవోకేలో 24 సీట్లు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. రెండు ‘నయా కశ్మీర్’ బిల్లులను (‘Naya Kashmir’ Bills) కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2023పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో మాట్లాడారు. జమ్ముకశ్మీర్లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లులు న్యాయం చేస్తాయని తెలిపారు. కశ్మీర్లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47కు పెంచినట్లు చెప్పారు. అలాగే జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43కు పెంచినట్లు వివరించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కూడా మనదేనని, అందుకే ఆ ప్రాంతంలో 24 సీట్లు రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు.
కాగా, భారత తొలి ప్రధాని నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల వల్ల జమ్ముకశ్మీర్ ఇంతగా బాధపడుతున్నదని అమిత్ షా విమర్శించారు. ముందుగా కాల్పుల విరమణ ప్రకటించి, ఆ తర్వాత కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లారని చెప్పారు. ‘ఇది నా తప్పు అని నెహ్రూ జీ చెప్పారు. ఇది తప్పు కాదు, ఈ దేశం చాలా భూమిని కోల్పోవడం పెద్ద తప్పు’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు నెహ్రూ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ము, కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2023 లోక్సభలో ఆమోదం పొందాయి.
BIG statement by Home Minister Amit Shah –
“We’ve reserved 24 seats for Pakistan occupied Kashmir. PoK is ours ⚡️ pic.twitter.com/b8y7Hqm7Q7
— Megh Updates 🚨™ (@MeghUpdates) December 6, 2023