Imran | పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జావేద్ బాజ్వా పదవీ కాలాన్ని ప్రధాని ఇమ్రాన్ పొడిగిస్తారా? పొడిగించరా? అన్న నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. నవంబర్ 28 తో బాజ్వా పదవీ కాలం ముగియబోతోంది. మరోవైపు ఆర్మీ చీఫ్ బాజ్వా ప్రధాని ఇమ్రాన్కు అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఆర్మీ చీఫ్ సేవల విషయంలో తాను అత్యంత సంతృప్తితోనే ఉన్నానని ఇమ్రాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బాజ్వా పదవీ కాలాన్ని పొడిగిస్తారా? లేదా? అన్న విషయంలో సస్పెన్స్గా మారింది. అయితే ఈ విషయంపై ప్రధాని ఇమ్రాన్ స్పందించారు. ఆర్మీ చీఫ్ పదవీ కాలం పొడిగింపు విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తేల్చి చెప్పారు.
‘నూతన సంవత్సరం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. నవంబర్ మాసం ఇంకా చాలా దూరంలో ఉంది. ఇప్పటి నుంచే ఆర్మీ చీఫ్ పదవీ కాలంపై ఎందుకింత బాధపడుతున్నారు. ఇంకా సమయం ఉంది కదా. ఈ విషయంపై నేనింకా ఆలోచించలేదు. ఆర్మీ సేవలపై అత్యంత తృప్తితోనే ఉన్నాను’ అని ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.