న్యూఢిల్లీ, డిసెంబర్ 8: చక్కెర, ఆహార ధాన్యాల ప్యాకింగ్కు జనపనార సంచుల వినియోగంలో తప్పనిసరిగా అనుసరించాల్సిన నిబంధనలను శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. జూట్ సంవత్సరం 2023-24కి సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆహార ధాన్యాలు వంద శాతం, చక్కెర ప్యాకింగ్ 20 శాతం గోనె సంచుల్లోనే విధిగా ప్యాక్ చేయాలి. ప్రభుత్వ నిర్ణయం కారణంగా దేశంలోని జూట్ మిల్లులలో పనిచేస్తున్న నాలుగు లక్షల మందికి, మిల్లులకు అనుబంధంగా ఉన్న వివిధ యూనిట్లకు, 40 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.