కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తుగ్లక్ స్థాయికి దిగజారింది. తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో ఉన్న ఆక్సిజన్ను తెలంగాణకు మళ్లించి, కర్ణాటకలోని బళ్లారి లేదా ఒడిశాలోని రూర్కెలా నుంచి ఆక్సిజన్ను తెచ్చుకోండని తమిళనాడుకు చెప్పడం విడ్డూరంగా ఉంది. అందరూ వివేచన కోల్పోయారా? ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోవడం తెలియదా? ఆక్సిజన్ కేటాయింపులో కేంద్రం తన నియంతృత్వ వైఖరిని విడనాడి ఆక్సిజన్ సమకూర్చుకొనే స్వేచ్ఛను రాష్ర్టాలకు కల్పించాలి.