భువనేశ్వర్: ఒడిశాలోని డిస్టల్లరీ(Odisha Distillery) కంపెనీపై రెండు రోజుల నుంచి ఐటీశాఖ తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బౌద్ డిస్టిల్లరీ కంపెనీ నుంచి సుమారు 250 కోట్ల నగదును సీజ్ చేశారు. జార్ఖండ్లో కూడా ఆ కంపెనీ ఆఫీసులపై దాడి జరిగింది. ఇంకా ఆ కంపెనీలపై ఐటీశాఖ తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తొలి రోజు సుమారు 50 కోట్ల క్యాష్ను సీజ్ చేశారు. ఇప్పుడు ఆ అమౌంట్ 200 కోట్లు దాటింది. ఆ మొత్తాన్ని లెక్కపెట్టేందుకు మూడు డజన్ల కౌంటింగ్ మెషీన్లు వాడారు. సామర్థ్యానికి తగ్గ లేనటువంటి మెషీన్లు ఉండడం వల్ల ఇంకా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది.
జార్ఖండ్కు చెందిన రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూ ఆఫీసుల్లోనూ సోదాలు జరిగాయి. సుమారు 200 కోట్ల మేర నగదు అల్మారాల్లో కుక్కిపెట్టారు. బాలానగర్ జిల్లాలో ఉన్న డిస్టిల్లరీ గ్రూపు సెంటర్ నుంచి ఆ మొత్తాన్ని సీజ్ చేవారు. సంబల్పుర్, సుందర్ఘర్, బొకారో, రాంచీల్లోనూ ఐటీశాఖ సోదాలు జరిగాయి.
VIDEO | “Unaccounted” cash amounting up to Rs 250 crore is expected to have been recovered during the searches being conducted by the Income Tax Department against an Odisha-based distellery group and its linked entities in Bhubaneswar. The raids, that were launched on December 6… pic.twitter.com/gjxfvXhkYn
— Press Trust of India (@PTI_News) December 8, 2023