ముంబై: మహారాష్ట్రలో లక్షకు పైగా లవ్ జిహాదీ(Love Jihad) కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్రానికి చెందిన మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మంగల్ ప్రభాత్ లోధా(Mangal Prabhat Lodha) తెలిపారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ శ్రద్ధా వాల్కర్ లాంటి కేసులు జరగకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో శ్రద్ధా వాల్కర్ లాంటి కేసులు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
మతాంతర వివాహాల(Interfaith Marriages) అంశంపై కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ ఈ అంశాలను పరిశీలిస్తుందన్నారు. అసెంబ్లీలో చేసిన ప్రసంగానికి చెందిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. బడ్జెట్ సెషన్ సమయంలోనే కొత్త వుమెన్స్ పాలసీ(Women policy)ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
महाराष्ट्रात पुन्हा एकदा श्रद्धा वालकर सारखी घटना न घडावी, ही सरकारची जबाबदारी आहे. @mieknathshinde @Dev_Fadnavis@CMOMaharashtra#InternationalWomensDay #WomensDay #NariShakti #NariShaktiForNewIndia pic.twitter.com/jiP9b4qC9e
— Mangal Prabhat Lodha (@MPLodha) March 9, 2023