న్యూఢిల్లీ: రాజ్యసభ ( Rajya Sabha )లో వరుసగా మూడో రోజు కూడా విపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. ఛైర్మన్ పోడియాన్ని ముట్టడించారు. ధాన్యం సేకరణ, పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో మరణించిన రైతులకు పరిహారం విషయమై సభలో నినాదాలు చేశారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.
విపక్షాల ఆందోళనలతో గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనా సేమ్ సీన్ రిపీట్ కావడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది.