న్యూఢిల్లీ: పార్లమెంట్(Parliament)లో విపక్షాలు పట్టు వీడడం లేదు. అదానీ సంక్షోభం(Adani issue)పై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ.. ఉభయసభలను మళ్లీ స్తంభింపజేశాయి. ఇవాళ కూడా లోక్సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ బిల్డింగ్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్(first floor)పై విపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అదానీ అంశంపై జేపీసీ(JPC)తో దర్యాప్తు చేపట్టాలని నినాదాలు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో భారీ బ్యానర్ కూడా కట్టారు. ఇక తృణమూల్ ఎంపీలు ప్రత్యేకంగా ఆందోళన చేపట్టారు. అదానీ అంశంపై ప్రధాని మోదీ తన మౌనాన్ని వీడాలని టీఎంసీ ఎంపీలు డిమాండ్ చేశారు.
Delhi | Opposition MPs protest on the first floor of the Parliament and demand a JPC inquiry into the Adani Group issue. pic.twitter.com/nbs2X6Nwtm
— ANI (@ANI) March 21, 2023
అదానీపై విచారణకు ఆదేశించకుండా ఆయనకు సహకరిస్తున్నట్లు కేంద్ర సర్కార్పై టీఎంసీ(TMC) ఆరోపణలు చేసింది. అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, శివసేన, జేడీయూ, జేఎంఎం, ఐయూఎంఎల్, ఆప్, ఎండీఎంకే పార్టీలు ప్రతిపక్ష నేత ఖర్గే చాంబర్లో భేటీ అయ్యారు. మరోవైపు రాహుల్ గాంధీ(Rahul Gandhi) క్షమాపణలు చెప్పాలని కోరుతూ అధికార పక్షం డిమాండ్ చేస్తోంది.