న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరిన నేపథ్యంలో బుధవారం కూడా ప్రతిపక్షాలు రాజ్యసభలో గందరగోళం సృష్టించారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మార్షల్స్ను పిలిపించగా వారికి, ప్రతిపక్ష నేతల మధ్య ఘర్షణ జరిగింది. కాగా, ప్రతిపక్ష నేతలు మార్షల్స్పై చేయిచేసుకున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. “ఇది చాలా ఖండించదగినది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆయన అన్నారు. మరోవైపు సభలో గందరగోళం కారణంగా ఒక మహిళా కాంగ్రెస్ ఎంపీ చేతికి గాయమైందని టీఎంసీ ఎంపీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల లీడర్లు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా, మోడీ-షా గుజరాత్ మోడల్ ఇప్పుడు ఢిల్లీలో నిజంగా కళ్లకు కడుతున్నదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ విమర్శించారు. బీమా బిల్లు ఆమోదం కోసం రాజ్యసభలో ఎంపీల కన్నా సెక్యూరిటీ గార్డులు ఎక్కువగా కనిపించారని ట్విట్టర్లో ఆరోపించారు.