వీణవంక, జనవరి 1: తహసీల్దార్ పెండింగ్లో పెట్టిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను.. తహసీల్దార్కే తెలియకుండాదొడ్డిదారిన జారీ చేసిన డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో సోమవారం జరిగింది. వీణవంక మండలం బేతిగల్కు చెందిన ఓ కుటుంబం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నది. వారి కుటుంబంలో గొడవల నేపథ్యంలో తహసీల్దార్ తిరుమల్రావు ఆ ఫైల్ను పెండింగ్లో ఉంచారు. డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి.. తహసీల్దార్ డిజిటల్ కీని తస్కరించి ఆ ఫైల్ను ఆన్లైన్ చేయించారు. దొడ్డిదారిన సర్టిఫికెట్ జారీ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ తిరుమల్రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీటీ శ్రీనివాస్రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.