ఇంఫాల్, మే 24: మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు వర్గాల మధ్య అల్లర్లు కొనసాగుతున్నాయి. పరస్పరం ఇండ్ల ను దహనం చేసుకుంటున్నారు. బుధవారం బిష్ణుపూర్లోని ఆ రాష్ట్ర మంత్రి కొంతౌజమ్ గోవిందాస్ ఇంటిపై ఒక వర్గానికి చెందిన ప్రజలు దాడి చేశారు. మిలిటెంట్ల నుంచి తమను కాపాడేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం లేదనే ఆగ్రహంతో ఈ దాడి చేసినట్టు అధికారులు చెప్తున్నారు.
గ్యాస్ రూ.1,800.. పెట్రోల్ రూ.170
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజధాని ఇంఫాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.170 అయ్యింది. గ్యాస్ సిలిండర్ రూ. 1,800కు అమ్ముతున్నారు. అల్లర్ల ప్రభావం లేని జిల్లాల్లోనూ నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి.