New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో పీజీ భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఎయిమ్స్ ట్రామా కేర్ (AIIMS Trauma Care) సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సత్యనికేతన్ ప్రాంతంలోని ఐదంతస్తుల మేడ ఒక్కసారిగా కూలిపోవడంతో శిథిలాల కింద పలువురు విద్యార్థులు చిక్కుకుపోయారు. సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ అధికారులు ఇప్పటివరకూ ఎనిమిది మందిని కాపాడామని తెలిపారు.
ఢిల్లీ యూనివర్సిటీ దక్షిణ క్యాంపస్కు సమీపంలోని పీజీ భవనం కుప్పకూలిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. సత్యనికేతన్ ప్రాంతంలో ఇరుకుగా ఉండే హాస్టల్ భవంతుల సముదాయంలోని ‘హాస్టల్ డేజ్’ భవంతి ఆదివారం మధ్యాహ్నం 1:30 సమయంలో కూలిపోయింది. బేస్మెంట్లో నిర్మాణ పనులు జరుగుతుండగానే ఒక్కసారిగా బిల్డింగ్ పడిపోయింది. భయాందోళనకు గురైన స్థానికులు 1:33 గంటలకు అగ్నిమాపక కేంద్రానికి, సౌత్ క్యాంపస్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు.
STORY | Building collapses in south Delhi’s Satya Niketan; 1 dead, 2 critical, several trapped
A 50-year-old five-storey building housing a boys’ hostel collapsed in a congested bylane in Satya Niketan near Delhi University’s south campus on Sunday afternoon, leaving one dead… pic.twitter.com/68BnvBMqFY
— Press Trust of India (@PTI_News) September 6, 2026
ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వీరికి ఎయిమ్స్ ట్రామా కేర్లో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. అయితే.. పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రాణభయంతో మమ్మల్ని కాపాడండి. మాకు సాయం చేయండి అని వారు ఫోన్లు చేశారు. దాంతో.. పోలీసులు, అధికారులు సహాయ చర్యలను వేగవంతం చేశారు. వీరికి విద్యార్థులు, స్థానికులు కూడా చేయందించగా శిథిలాల తొలగింపు ప్రక్రియ పుంజుకుంది.
ఈ దుర్ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడ్డవాళ్లకు మెరుగైన చికిత్స అందించాలని షా అదేశించారు. బిల్డింగ్ యజమాని, గురుగ్రామ్కు చెందిన అనంద్ బన్సల్పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.