చెన్నై: చెన్నై నౌకాశ్రయం(Chennai harbour)లో ఆయిల్ ఉత్పత్తులతో ఉన్న ఓ ట్యాంకర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఆ షిప్లో పనిచేస్తున్న కార్మికుడు తంగరాజ్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. జోషువా, రాజేశ్, పుష్పలింగం అనే మరో ముగ్గురు గాయపడ్డారు. వారిని కిల్పక్ మెడికల్ కాలేజీలో చికిత్స కోసం చేర్పించారు. షిప్కు చెందిన ఇంజిన్ వద్ద గ్యాస్ కట్టర్తో రిపేర్ వర్క్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. గ్యాస్ కట్టర్ నుంచి వచ్చిన స్పార్క్లు పైప్లైన్పై పడ్డాయి. దీంతో అక్కడ అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి చెన్నై పోర్టుకు అక్టోబర్ 30వ తేదీన ఆ నౌక వచ్చింది. హార్బర్ పోలీసులు కేసును విచారిస్తున్నారు.