జైపూర్: హర్యానాలోని భీవని ప్రాంతంలో కారులో రెండు కాలిపోయిన మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. మృతులు రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా ఘట్మీకా గ్రామానికి చెందిన నసీర్(25), జునైద్(35)గా పోలీసులు గుర్తించారు. బజరంగ్దళ్, గోరక్ష కార్యకర్తలే వీరిని హతమార్చారని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు గోరక్ష బృందంలో పని చేసే ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. జునైద్పై గతంలో ఆవుల అక్రమ రవాణా కేసులు ఉన్నాయి.