లక్నో: రైలులో ప్రయాణించిన వృద్ధ దంపతులపై మద్యం సేవించిన వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. (man urinates on elderly couple in Train) దీంతో వారు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడ్ని రైలు నుంచి దించివేశారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన రిటైర్డ్ శాస్త్రవేత్త దంపతులు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని థర్డ్ ఏసీ కోచ్లో ప్రయాణించారు. అదే కోచ్లో ప్రయాణించిన రితేష్ రైలులో మద్యం తాగాడు. ఆ వృద్ధ దంపతులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులున్న బెర్త్పై రితేష్ మూత్ర విసర్జన చేశాడు.
కాగా, వృద్ధ దంపతులు ఈ విషయాన్ని టీటీఈ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రైల్వే హెల్ప్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రైలు ఝాన్సీ స్టేషన్కు చేరగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది ఆ కోచ్ వద్దకు వచ్చారు. వృద్ధ దంపతులపై మూత్ర విసర్జన చేసిన రితేష్ను రైలు నుంచి దించివేశారు. టీటీఈ స్టేట్మెంట్ ఆధారంగా అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.