న్యూఢిల్లీ, మే 22: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ మీద దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి స్పందించారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం ఈ అంశం విచారణ దశలో ఉన్నందున తాను స్పందిస్తే విచారణపై ప్రభావం పడుతుందని అన్నారు. అయితే, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని, న్యాయం చేయాలని మాత్రం తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి రెండు రకాల వాదనలు ఉన్నందున పోలీసులు ఇరువైపుల వాదనలపై విచారణ జరిపి, న్యాయం చేయాలని పేర్కొన్నారు.