న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం సందర్భంగా భారత్, చైనా సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాలైన కేకే పాస్, డీబీవో, బాటిల్నెక్, కొంకలా, చుషుల్ మోల్డో, డెమ్చోక్ హాట్స్ప్రింగ్, నాథులా, కొంగ్రాలా, బమ్ లా, వాచా దమైలోని సైనిక శిబిరాల వద్ద శనివారం ఈ కార్యక్రమాలు జరిగినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. నూతన సంవత్సరం నేపథ్యంలో భారత్, చైనా సైనిక అధికారులు పరస్పరం మిఠాయిల బాక్సులను మార్చుకున్నట్లు పేర్కొంది. కాగా, సాధారణంగా దేశ స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున భారత్, పాక్ సైనికుల మధ్య స్వీట్ల పంపిణీ జరుగుతుంది. అయితే చైనా కూడా ఇందులో మమేకమైంది. అరుదైన సందర్భాల్లో ఇరు దేశాల సైనిక అధికారులు ఒకరినొకరు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.