Tajinder Bagga Dispute | బీజేపీ ఢిల్లీ నాయకుడు తేజిందర్ సింగ్ పాల్ బగ్గాను తదుపరి విచారణ ముగిసే వరకు ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని పంజాబ్ సర్కార్ను పంజాబ్ & హర్యానా హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 10 వరకు వాయిదా వేసింది. తనపై మొహాలీ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారంట్ను సవాల్ చేస్తూ తేజిందర్ సింగ్ పాల్ బగ్గా శనివారం అర్ధరాత్రి హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ అనూప్ చిత్కారా నివాసంలో ఈ అర్ధరాత్రి విచారణ జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తేజిందర్ పాల్ బగ్గాపై పంజాబ్లోని మొహాలీ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, నేరపూరితంగా బెదిరింపులకు పాల్పడం వంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఐపీసీలోని 153-A, 505, 505 (2), 506 సెక్షన్ల కింద బగ్గాపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బగ్గా అరెస్ట్కు వారంట్ జారీ చేయాలని శనివారం మొహాలీ కోర్టును ఆశ్రయించగా, అతడ్ని అరెస్ట్ చేయాలని న్యాయస్థానం వారంట్ జారీ చేసింది.