సౌతాఫ్రికాలో ‘ఓమిక్రాన్’ కరోనా వేరియంట్ బయటపడటంతో ప్రపంచం మొత్తం గజగజలాడుతోంది. ఇలాంటి తరుణంలో ఆ దేశం నుంచి కర్ణాటక వచ్చిన ఇద్దరిలో కరోనా ఉన్నట్లు తేలింది. బెంగళూరు విమానాశ్రయంలో వీరికి చేసిన పరీక్షల్లో కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో వారికి ‘ఓమిక్రాన్’ వేరియంట్ సోకిందా? అనే అనుమానాలు తలెత్తాయి.
ఈ కారణంగా కరోనా పేషెంట్ల శాంపిల్స్పై మరిన్ని పరీక్షలు చేశారు. ఈ పరీక్షల అనంతరం కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ మాట్లాడారు. ఎయిర్పోర్టులో వెలుగు చూసిన రెండో కరోనా కేసుల్లో ఒక వ్యక్తిలో ఉన్న వేరియంట్ ‘డెల్టా’ కాదని ఆయన స్పష్టం చేశారు.
అయితే అది ఓమిక్రాన్ అవునా? కాదా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ‘ఒక పేషెంట్లో ఉన్న కరోనా.. డెల్టా వేరియంట్కు భిన్నంగా ఉంది. ఓమిక్రాన్ విషయంలో నేనేమీ మాట్లాడదలచుకోవడంలేదు. ఈ విషయంపై ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్యశాఖతో చర్చలు జరుపుతున్నాం’ అని సుధాకర్ పేర్కొన్నారు.