ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత దేశం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే భారీ స్థాయిలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది.
కరోనా సెకండ్ వేవ్ కష్టాలను ఎలాగోలా అధిగమించి, మళ్లీ సాధారణ జీవనం వైపు సాగుతున్న భారత్కు ‘ఒమిక్రాన్’ ఒక పెద్ద ఎదురుదెబ్బ అని ఐఎంఏ అభిప్రాయపడింది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వేరియంట్ను నియంత్రించవచ్చని తెలిపింది.
వ్యాక్సినేషన్ విషయంలో చిత్తశుద్ధితో ఫోకస్ పెట్టి పనిచేస్తే కరోనా థర్డ్వేవ్ను అడ్డుకోగలుగుతామని, ఒమిక్రాన్ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతామని పేర్కొంది.