శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో వర్గాలను విభజించే లక్ష్యంగా పౌరులపై దాడులు జరుగుతున్నాయని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్లోని మెజారిటీ కమ్యూనిటీకి చెందిన వారు ఇక్కడి మైనార్టీ ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించాలని కోరారు. శ్రీనగర్లో గురువారం ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన స్కూల్ ప్రిన్సిపాల్ సుపిందర్ కౌర్ కుటుంబాన్ని ఒమర్ అబ్దుల్లా శుక్రవారం కలిశారు. ఆ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పౌరులపై ఉగ్రవాదుల దాడిని ఒమర్ అబ్దుల్లా ఖండించారు.