గాంధీనగర్, మార్చి 5: గుజరాత్లో ఘోరం చోటుచేసుకున్నది. 60 ఏండ్ల వృద్ధురాలిపై మూడు వీధి ఆవులు దాడి చేశాయి. కొమ్ములతో పొడవడంతో ఆమె కిందపడిపోయారు. అయినా అలాగే దాడి చేశాయి. ఇది గమనించిన స్థానికులు ఆవులను తరిమి వృద్ధురాలిని దవాఖానకు తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యు లు ధ్రువీకరించారు. కాగా, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో వీధి ఆవుల సమస్య అధికంగా ఉన్నదని, గోశాలలను ఏర్పాటు చేసి తరలించాలని ప్రజలు ఎన్నిసార్లు ఆందోళన చేసినా అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.